- డా.కొడవటిగంటి రోహిణీప్రసాద్
జీవపరిణామం గురించిన సరైన అవగాహన భౌతికవాద దృక్పథానికి తోడ్పడుతుంది. అందుచేత అదేదో జీవశాస్త్రం గురించి ఆసక్తి ఉన్నవారికి మాత్రమే పరిమితమైన విషయం కాదు. అందులోని తాత్విక అంశాలు అందరూ తెలుసుకోదగ్గవే. ఇది పంతొమ్మిదో శతాబ్దంలో మొదలైన సిద్ధాంతం.
1835లో డార్విన్ దక్షిణ అమెరికాలోని ఈక్వడార్ దేశానికి వెయ్యి కిలోమీటర్లు పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న గలాపగోస్ ద్వీపాలకు వెళ్ళాడు. అక్కడ ఆయనకు కొన్ని జాతులకు చెందిన జంతువులు కనబడ్డాయి. ఒకే ద్వీపసమూహంలో ఉన్నవే అయినా ఒక్కొక్క ద్వీపంలోనూ తక్కిన ద్వీపాలతో సంబంధం లేకుండా ఎదిగిన వాటి లక్షణాల్లో తేడాలు కనిపించాయి. ఒకే కుదుటి నుంచి మొదలైన ప్రాణుల్లో స్థానిక పరిస్థితులను బట్టి క్రమంగా శరీరాకృతిలోనూ, అలవాట్లలోనూ కాస్త కాస్తగా తేడాలు ఏర్పడ్డాయని అర్థమైంది. జీవపరిణామ సిద్ధాంతం ప్రతిపాదనకు ఈ పరిశోధనలు తోడ్పడ్డాయి.
పూర్తిగా చదవండి »
అనువాదం: అబ్బాస్

కమ్ముకున్న చీకటిరాత్రిలోంచి నీ జ్ఞాపకం తన్నుకొస్తుంది-
నది, తన ధీరవిలాపాన్ని సముద్రంలో కలిపేస్తోంది!!
ఉదయపువేళల చిన్నబోయి ఉండే బోసిరేవులా ఉన్నావు-
ఇక వీడ్కోలు చెప్పుకోవలసిన ఘడియ సమీపించింది!!
తలలు తెగిన మంచుపూలు గుండె మీద రాలిపడుతోన్నాయి-
చెత్తాచెదారాలతో చెలువారే గుంటవి,
ముక్కలు చెక్కలయిన ఓడయాత్రికుల మహోగ్రకుహరానిని!!
యుద్ధాలూ, తిరుగుబాట్లూ పేరుకున్నది నీలోనే-
పాటపక్షులు రెక్కలు విప్పిందీ నీలోనే!!
దూరంలా - సంద్రంలా - కాలంలా,
అన్నిటినీ దిగమింగేశావు నువ్వు;
నీలోలోపల అన్నీ ములిగిపోయాయి!!
దాడులతోనూ, ముద్దులతోనూ నిండిన సంతోష సమయమది;
’బంకోలా’ లా భగ్గుమన్న మంత్రఘడియలవి!!
చోదకుడి భయాన్నీ – నావికుడి ఆగ్రహాన్నీ
ప్రేమోన్మాదపు మైకాన్నీ – అన్నిటినీ నీలో కలిపేసుకున్నావు!!
పూర్తిగా చదవండి »
- ఐరా గొలోబిన్
తొలి రోజుల్లో అమెరికాకు వలసవచ్చి స్థిరపడినవారికి చుట్టూ ఉన్న పరిస్థితులను మార్చకతప్పలేదు; కొంతమంది తత్వవేత్తల్లాగా కేవలం వాటిని అర్థం చేసుకోవడంతో వారికి సరిపోలేదు. ఏదో చేసెయ్యాలనేదే తప్ప శాస్త్రీయ ప్రాపంచిక దృక్పథం లేకపోవడంతో వీరందరికీ సిద్ధాంతాలంటే ఏవగింపు ఉండేది. అయినప్పటికీ వీరందరూ తమ మాతృదేశాల్లో అమలులో ఉండిన రకరకాల తత్వధోరణులని కలగాపులగమైన పద్ధతిలో గుడ్డిగా ఆచరించడం మాత్రం చేసేవారు. తత్వశాస్త్రాలని గట్టిగా నమ్మినవారి సంఖ్య అప్పట్లో తక్కువే అయినప్పటికీ వలసదేశమైన అమెరికాలో తాత్విక వైఖరి శూన్యంగా మాత్రం ఉండేది కాదు.
పూర్తిగా చదవండి »
బతికున్న మనుషులకు గల ముఖ్యలక్షణం చైతన్యం (consciousness). తల్లి కడుపులో పిండ దశలో ఉండగానే ఇది ప్రాథమిక స్థాయిలో మొదలవుతుంది. మనిషి పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఇది ఎక్కువై, మానసిక చైతన్యమే యథార్థమనీ, మనకు కనబడే లోకమంతా మిథ్య అనీ అనిపించేదాకా ఎదుగుతుంది. వస్తుపరమైన యథార్థత (objective reality) అనేది మన చైతన్యానికి సంబంధం లేనిదని లెనిన్ అన్నాడు. మార్క్సిస్టులు కాని ఐన్ష్టయిన్ వంటి మేధావులుకూడా యథార్థానికీ మన చైతన్యానికీ సంబంధమేదీ లేదని అంగీకరించారు.
పూర్తిగా చదవండి »
సిద్ధాంతాలను ప్రతిపాదించగలిగిన శక్తి సామాన్యంగా ప్రతివారికీ ఉన్నప్పటికీ పుట్టుకతోనే ఎవరూ సిద్ధాంతకర్తలుగా అవతరించరు. “…మనోభావనల ఆధారంగా ప్రతిపాదనలు చెయ్యడమనేది జన్మతః వచ్చే విద్యకాదు; అందుకు రోజువారీ జీవితపు చైతన్యం ఉంటే చాలదు. దానికై నిజంగా ఆలోచించాలి …”.21
పూర్తిగా చదవండి »
ఎవ్రీబడీ క్రైస్…
- అల్లం నారాయణ
తలుపు తోసుకుని మృత్యువు అనాగరికంగా, అమెరికాలాగా వస్తుందని ఊహించి ఉండమేమో కదా! కిరణ్ దుఃఖం మా కుటుంబాన్ని వదలడం సాధ్యమా! పనిలో సరే! పదిమందిలో సరే! భ్రాంతిలో ఏకాంతంలో జ్ఞాపకాలు జ్ఞాపకాలుగా, శకలాలు శకలాలుగా అంతూ దరీలేని శోకం వెన్నాడి ఉండడం మేమెప్పుడూ ఎరగం. సాదాసీదా మనుషులం.
పూర్తిగా చదవండి »
అడవి తల్లి బిడ్డలుగ పుట్టుడే మా పాపమా
కొండ కోనల్లో మేము వుండుడే మా నేరమా
మా …. ఆడోల్ల చెరచబట్టిరో ….. పోలీసులు
మొగోల్ల చంపబట్టిరో … పోలీసులు
|| అడవి ||
పూర్తిగా చదవండి »
భౌతికవాదాన్ని నమ్మేవారికి మనిషి దైవాంశసంభూతుడు కాడని చెప్పవలసిన అవసరం లేదు. కాని మనిషికి ఉండే మెదడు ప్రత్యేకమైనది. దానివల్ల బుద్ధిని గురించిన వాదనలెన్నో తలెత్తుతాయి. విజ్ఞానపరంగా చెప్పాలంటే వ్యక్తిగతంగానూ, సామాజికంగానూ మనిషి అనుభవించే కష్టసుఖా లన్నిటికీ మెదడే కారణం.
పూర్తిగా చదవండి »
- అగష్టస్ కనుమూరి, ఏలూరు
చూపు మందగించిపోయి
అవాంచనీయ కిరణాలేవో చొచ్చుకొస్తున్నాయి
మసకబారిన నేడులో కలలు జారిపోతున్నాయి
అక్షరాలు తడుముకుని పేర్చుకున్నా
అల్లిబిల్లిగా అల్లుకుపోతున్నాయి
పదాలుచేర్చుకొని కూర్చున్నా
అస్పష్టమై ఆవిరైపోతున్నాయి
పూర్తిగా చదవండి »
యువకవి, హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటిలో తెలుగు అధ్యాపకుడుగా పనిచేస్తున్న డా.దార్ల్ల వెంకటేశ్వరరావుని భారతీయ దళితసాహిత్య అకాడమీ వారు ఈ ఏడాది (2007) డా.అంబేడ్కర్ ఫెలోషిప్ అవార్డుతో సత్కరించారు.
పూర్తిగా చదవండి »

చిత్రకారిణి: యాష్లీ సిసిల్
- తుమ్మల దేవరావ్, నిర్మల్, అదిలాబాదు జిల్లా
నిద్రలోంచి స్వప్నం జారుకున్నట్టుగా
నమ్ముకున్న నేల
కాళ్ళకిందనుంచి అమాంతంగా ఎగిరిపోయింది
మట్తితో నింపుకున్న తెగని బతుకుదారం
పుటుక్కున తెంపి పారేస్తున్నట్లుంది
పూర్తిగా చదవండి »
ప్రజాస్వామ్య దేశంలో కలాలకు సంకెళ్ళు వేసి నిజాలను దాచాలని ప్రయత్నిస్తే ప్రభుత్వాలకు పునాదులు ఉండవని మూసి టివి ఎడిటర్ పిట్టల శ్రీశైలం తెలిపారు. మావోయిస్టుల కొరియర్గా ముద్రవేసి ఇటీవల పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు.
పూర్తిగా చదవండి »
జర్నలిస్టు పిట్లల శ్రీశైలం విడుదల డిమాండు చేయండి!!
తన వృత్తిలో భాగంగా భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) నాయకుడ్ని ఒకర్ని ఇంటర్వూ చేద్దామని వెళ్ళిన జర్నలిస్టు పిట్టల శ్రీశైలం(33)ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రకాశం జిల్లా కందుకూరు లో అరెస్టు చేశారు. శ్రీశైలం మావోయిస్టులకు కొరియర్ గా పనిచేస్తున్నట్లు కూడా ఆరోపణలు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి »
- ఐరా గొలోబిన్
మొదటి అధ్యాయం
కార్మికులూ, వైజ్ఞానిక తత్వశాస్త్రం
వైజ్ఞానిక తత్వశాస్త్రం గురించి కార్మికులెందుకు తెలుసుకోవాలి?
(ప్రారంభంలోనే కార్మికులను ప్రస్తావించడంలోని ఉద్దేశం కార్మికులు కానివారెవరికీ వైజ్ఞానిక తత్వశాస్త్రంతో ప్రమేయం ఉండరాదని కాదు. ఇలాంటి సందర్భాల్లో కార్మికుల ప్రస్తావన సామాన్యంగా అంతగా ఉండదు కనకనే వారి ప్రాముఖ్యతనూ, ప్రమేయాన్నీ గుర్తించడం అవసరం)
పూర్తిగా చదవండి »
అనువాదం: అసూర్యంపస్య
“ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, పదకొండు” - సురపతి పెట్టెలని లెక్కపెట్టడం ముగించి తన సహాయకుడు అనిల్ వైపుకి తిరిగాడు.
“సరిగానే ఉన్నాయి. ఇవన్నీ వ్యాన్ లోకి తరలించండి. మనకు ఇరవై ఐదు నిముషాలే ఉంది ఇంకా.” - అన్నాడు.
పూర్తిగా చదవండి »
నందిగ్రామ్ వెనక…
- పాణి
నందిగ్రామ్ పరిణామాలే ఎంతో ఆందోళనకరమైనవైతే అంతకంటే కలవరం కల్గిస్తోంది భారత కమ్యూనిస్టుపార్టీ (మార్క్సిస్టు) వైఖరి. సిపిఎం అభిమానులైన బుద్ధిజీవులే నందిగ్రామ్ ఘటనలపట్ల నిరసన తెలిపారు. ఇంకా తెలుపుతున్నారు. అయినా బెంగాల్ మార్క్సిస్టుపార్టీ అధినాయకత్వం మాట్లాడుతున్న తీరు వారి వైఖరిలో మార్పు వస్తుందన్న ఆశ కల్పించడం లేదు.
పూర్తిగా చదవండి »