కొండేపూడి నిర్మల ప్రముఖ స్త్రీవాద కవయిత్రి,రచయిత్రి. 1980 దశకంలో తెలుగు సాహిత్యంలోకి ఉవ్వెత్తున ఎగిసిపడుతూ వచ్చి చేరిన స్త్రీవాదం ఎంతోమందిని ప్రభావితం చేసింది. అప్పటివరకూ అంటరానివిగా మిగిలిపోయిన ఎన్నో కొత్త వస్తువులను స్వీకరించి,స్త్రీవాద స్పృహ తో, స్త్రీల దృష్టి కోణంతో కవిత్వం రాసిన వారిలో కొండేపూడి నిర్మలను ప్రముఖంగా పేర్కొనాలి. ముఖ్యంగా నిర్మల రాసిన “లేబర్రూం” కవిత పురుష విమర్శకులకు దిమ్మ తిరిగేలా చేసింది. ప్రసవసమయంలో స్త్రీ పడే వేదనని “రైలు పట్టాలమీద నాణెం విస్తరించిననంత బాధ” అంటుంది. నిర్మల తెలుగు సాహిత్యంలో స్త్రీవాద గొంతును బలంగా,తీవ్రంగా,సూటిగా వినిపించడంలో అగ్రభాగాన ఉన్నదనడంలో అతిశయోక్తి ఎంత మాత్రమూ లేదు.

పూర్తిగా చదవండి »

ఇటీవల సాహిత్యవిమర్శకులు కడియాల రామోహనరాయ్ గారిని ఇంటర్వూ చేయడం జరిగింది. దీనిలోనుండి కొన్ని ఎంపిక చేసిన భాగాలను ఆడియో రూపంలో అందిస్తున్నాం.
మొదటి భాగం:
పూర్తిగా చదవండి »
- కేతు విశ్వనాధరెడ్డి
కాళీపట్నం రామారావు గారు తెలుగు జాతి గర్వించదగ్గ కథా రచయిత. ఆధునిక భారతీయ సాహిత్య నిర్మాతలలో చేరదగిన సాహిత్యకారుడు ఆయన. కారాగా, మాష్టారుగా, కథల మాష్టారుగా తెలుగు సాహిత్యలోకంలో ప్రసిద్ధులు. కథారచయితలకు “దీపధరుడు”- ఆయన.
http://www.prajakala.org/PDF/kara_interview.pdf
సౌజన్యం: ఈ-తెలుగు పత్రిక
కవితా వార్షిక-2006 ఆవిష్కరణ సందర్భంగా ప్రధాన సంపాదకుడు రామా చంద్రమౌళితో ముఖాముఖి
‘సృజనలోకం వరంగల్’ ప్రచురణగా అంతర్జాతీయ ప్రమాణాలతో గత మూడు సంవత్సరాల నుండి వెలువడుతూ తెలుగు వచన కవితను ప్రపంచవ్యాప్తం చేస్తున్న నేపథ్యంలో, కవితా వార్షిక-2006ను ప్రముఖ విప్లవకవి డాక్టర్ పెండ్యాల వరవరరావు 18 మార్చి 2007, ఆదివారం ఉదయం పదకొండు గంటలకు వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సెమినార్ హాల్లో ఆవిష్కరించారు.
పూర్తిగా చదవండి »
* సారా ఉద్యమం గురించి…..
సారా ఉద్యమ వైఫల్యం స్త్రీలకొక నమ్మకద్రోహం… ఉద్యమాన్ని రాజకీయ ప్రయోజనాలకి వాడుకోవడం మాత్రమే జరిగింది. ఇవ్వాళ సారా సర్వాంతర్యామి. కళాశాలల్లోకి, గ్రామాల్లోకి, మురికివాడల్లోకి విపరీతంగా విస్తరించి మహిళా సాధికారత అని మనం బాకా ఊదుకొనే అంశాన్ని చావుదెబ్బ కొట్టింది. గృహహింస పెరిగింది. నేరాలు పెరిగాయి. స్త్రీల మీద అధిక భారం పడింది. మనిషిని ఆలోచనకి, వివేకానికి దూరం చేసింది. ప్రస్తుతం జలయజ్ఞం సంగతేమో కాని సారా యజ్ఞం మాత్రం జయప్రదంగా జరుగుతోంది.
పూర్తిగా చదవండి »

ప్రఖ్యాత జర్నలిస్ట్ అయిన ముమియా అబు-జమాల్ (Mumia Abu Jamal) 1954, ఏప్రిల్ 24న ఫిలడెల్ఫియాలో జన్మించాడు. ఫిలడెల్ఫియాలో డేవిడ్ ఫాల్క్నర్ (David Faulkner) అనే పోలీస్ అధికారిని కాల్చి చంపాడన్న నేరారోపణపై ఆయన 1981 నుండి జైలులో, 1983 నుండి డెత్-రో పై (Death Row అంటే మరణ శిక్ష విధించబడి అది అమలయేందుకు ఎదిరి చూస్తూ జైలులో గడపడం) ఉన్నాడు. పూర్తిగా చదవండి »
- ఖాజా
దళిత సాహిత్య ఉద్యమానికి వెన్నుగర్ర నగేష్ బాబు. వచన కవిత్వం కేవలం కొంతమంది చదువుకున్న మేధావుల కోసమే కాదు. వాడ వాకిట్లో నిల్చున్న కోట్లమంది చదువులేని వారికి, సామాన్య జనానిక్కూడా అని చెప్పి – వాళ్ళకు అర్థమయ్యేలా, వాడ యాసనూ, భాషనూ, నుడికారాన్నీ, లాజిక్ నీ తెచ్చి కవిత్వంగా మలిచాడు నగేష్ బాబు.
నగేష్ బాబు రాయటం మొదలు పెట్టాక వచన కవిత్వం సామాన్యులు చదువుకునే లేదా ఎవరైనా చదివితే విని ఆనందించే కథా కావ్యమైంది. జనరంజకమైంది. మేలుకొలుపు గీతమైంది.
పూర్తిగా చదవండి »
స్త్రీల సమస్యల పట్ల స్పందించడం ఇంకా అరుదైన మన ప్రవాస సమాజంలో, వారి పట్ల సానుభూతితో రచనలు చేసే ఆరి సీతారామయ్యది ప్రత్యేక ముద్ర. ‘ స్త్రీ పురుషులు సమానులుగా, పరస్పర గౌరవంతో బతగ్గలగటమే ప్రత్యామ్నాయం’ మనేది ఆయన శైలి. జ్ఞాపకాలూ, సాంప్రదాయప్రీతి, తెలుగుతనం దాటి జనజీవనానికి అద్దం పట్టే సాహిత్యం రావాలి అనే సీతారామయ్య గారితో ‘ప్రజాకళ’ ఇంటర్వ్యూ.
పూర్తిగా చదవండి »
- హిమబిందు
తనను ‘కనిపించే పదం’గా ప్రకటించుకున్న కల్పన రెంటాల, నిజానికి ‘వినిపించే బలమైన స్వరం’ కూడా. అచ్చం ఆమె కవితలలాగే… ఆమె మాట, భావాలు, వాటిని ప్రకటించే తీరు చాలా ‘ఇంటెన్సివ్’గా…నిలదీయటాకి ఏ మాత్రం భయపడని విధంగా వుంటాయి. అజంతా అవార్డు గ్రహీత అయిన కల్పన, స్త్రీ వాద కథ, సాహిత్య విమర్శలే కాకుండా పలు అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రాసి, ఇప్పుడున్న కొద్ది మంది సాహిత్య విమర్శకులలో ఒకరిగా మంచి గుర్తింపు పొందారు. ఇండియా-పాకిస్తాన్ కవయిత్రుల కవితల్ని ‘ఆమె పాట’ కాలమ్ కింద అనువాదం చేశారు. స్త్రీల స్వరాలు ఏ స్థాయిలో ఉన్నా ఆలకించాలని, గొంతు దాటి రాని ఆలాపనలను సైతం పసిగట్టి వినిపించాలని తపన పడే ఆమెతో చిన్న సంభాషణ…
పూర్తిగా చదవండి »