ఆర్ధిక, పారిశ్రామిక అభివృద్ది కోరుకునే శక్తులు, ఎన్టీ రామారావును పదవి నుండి దింపేశాయి. సమర్ధవంతమైన ప్రభుత్వం, వేగవంతమైన పాలన డిమాండు చేసాయి. ఆంధ్రప్రదేశ్ లోని ధనికవర్గం ఎన్టీఆర్ విఫలం అయ్యారని భావించారు.
కళ్ళముందు జరిగే రాజకీయ పరిణామాలు అన్నీ, అంత ముఖ్యమైనవి కాకపోవచ్చు. పెద్ద వయస్సులో ఎన్టీ రామారావు ను , ఆయన ఇద్దరు అల్లుళ్ళు ముఠా కట్టి, కొడుకుల సహాయంతో, పదవినుండి దింపేసిన సంఘటనను విశ్లేషించాలి. చివరి దశలో ఆయనకు జరగరాని పరాభవం జరిగింది, లేదంటే ఆయన చేసిన తప్పులకు తగిన పరాభవమే అనుభవించారు. ఈ సంఘటన గురించి ఎలా చెప్పుకున్నా, జనం పెద్దగా పట్టించు కోలేదు. ఆయన ప్రియమైన భార్య ‘రాజ్యాంగేతర శక్తి’గా ఎదగటం పెద్ద విషయం ఏమీ కాదు.