జీవితం మిధ్య అనడం అబద్ధం
ఎంగిలి మెతుకులేరుకుని ఎలక్ట్రిక్ తీగల మీదా
ఇళ్ళ కప్పుల మీదా జంతు కళేబరాల మీదా
‘అలగాజనం’ పుళ్ళ మీదా పొడుచుకు తినడానికి చేరే కాకులు మాత్రమే
మిధ్య గూర్చి కావుకావుమంటూ ప్రవచించగలవు
పూర్తిగా చదవండి »
అక్టోబర్, 2007 సంచిక
తప్పిన అడుగుల్లో
తలలు నాటుతున్నాం
కంటున్న కల పూర్తికాకుండానే
దబుక్కున మెలకువొస్తుంది
పూర్తిగా చదవండి »
నేను చూసివచ్చిన సముద్రం ఊసేమని చెప్పనూ
నా టెలివిజన్ కన్నుల్లో విను
నా మనసు మీద చెవి పెట్టి చూడు
నేనే క్యాసెట్నై రికార్డ్ చేసుకొని వచ్చిన
సముద్రం సంభాషణను విను
పూర్తిగా చదవండి »
సముద్రం ఘోష నన్నుతాకి
కన్నీటితో కడిగింది
నా ముందు తాను నురుగై కరిగిపోయింది
కెరటమై విరిగిపోయింది
కెరలి కెరలి తిరిగిపోయింది
నాయిన
ఎద్దుల బండి పోయిందని కాదు,
నాయినే పోయిండని
ఈ బాధ.
పూర్తిగా చదవండి »
కొండేపూడి నిర్మల ప్రముఖ స్త్రీవాద కవయిత్రి,రచయిత్రి. 1980 దశకంలో తెలుగు సాహిత్యంలోకి ఉవ్వెత్తున ఎగిసిపడుతూ వచ్చి చేరిన స్త్రీవాదం ఎంతోమందిని ప్రభావితం చేసింది. అప్పటివరకూ అంటరానివిగా మిగిలిపోయిన ఎన్నో కొత్త వస్తువులను స్వీకరించి,స్త్రీవాద స్పృహ తో, స్త్రీల దృష్టి కోణంతో కవిత్వం రాసిన వారిలో కొండేపూడి నిర్మలను ప్రముఖంగా పేర్కొనాలి. ముఖ్యంగా నిర్మల రాసిన “లేబర్రూం” కవిత పురుష విమర్శకులకు దిమ్మ తిరిగేలా చేసింది. ప్రసవసమయంలో స్త్రీ పడే వేదనని “రైలు పట్టాలమీద నాణెం విస్తరించిననంత బాధ” అంటుంది. నిర్మల తెలుగు సాహిత్యంలో స్త్రీవాద గొంతును బలంగా,తీవ్రంగా,సూటిగా వినిపించడంలో అగ్రభాగాన ఉన్నదనడంలో అతిశయోక్తి ఎంత మాత్రమూ లేదు.


మనుష్యులు తక్కిన జంతువులతో పోలిస్తే అసాధారణ జీవులే. మనుష్యుల ప్రత్యేక లక్షణాలకు వారి మెదడూ, బాగా పరిణతి చెందిన నాడీ వ్యవస్థా ముఖ్యకారణాలు. ఈ ప్రత్యేక లక్షణాల్లోనే కొన్ని తప్పుడు నమ్మకాలకూ, భ్రమలకూ కూడా దారితీస్తున్నాయి.
పూర్తిగా చదవండి »
సంప్రదాయసిద్ధంగా వస్తున్న నాటకరంగ సూత్రాలకు విరుద్ధంగా తెలుగు నాటికలలో తిరుగుబాటు ధోరణులను ప్రవేశపెట్టిన తొలి తెలుగు రచయితలపై నార్వే దేశీయుడైన హెన్రిక్ ఇబ్సన్ (1828-1906) ప్రభావం చాలా ఉంది. నాటక సూత్రాలను ఎదిరించిన ప్రథముడుగా స్థానం సంపాదించుకొన్నాడు ఇబ్సన్. అతడు సృష్టించిన నాటకరంగాన్ని ‘థియేటర్ ఆఫ్ రివోల్ట్,’ అన్నారు విమర్శకులు.
పూర్తిగా చదవండి »
అమెరికాలో ఉంటున్న అరుణతో ఛాటింగ్ చేస్తూ విరగబడి నవ్వుతోంది వసంత. పక్కన మ్యూజిక్ సిస్టంలో నుంచి వచ్చే పాట భూమిని అదరగొడుతోంది.
“అరగంట నుంచీ పిలుస్తున్నా… వినపడటంలా!'’ అని అరుస్తూ వచ్చి మ్యూజిక్ ఆపేసి, “పద… దోసెలు తిందువుగాని. అప్పుడే పదయింది. ఇంకెప్పుడు? ఆదివారమయితే అన్ని పన్లూ ఆపడమేనా?'’ అని కూతుర్ని కసిరింది వసుంధర.
పూర్తిగా చదవండి »
పదకొండేళ్ళ తరువాత అరూప్ బాబు అనబడు అరూప్ రతన్ సర్కార్ మళ్ళీ పూరీ నగరాన్ని సందర్శిస్తున్నాడు. నగరం లో ఈ పదకొండేళ్ళలో చెప్పుకోదగ్గ మార్పులే జరిగినట్లు గమనించాడు - కొన్ని కొత్త ఇళ్ళు, కొత్త రోడ్లు, కొత్త హోటెళ్ళు - చిన్నవీ, పెద్దవీనూ. కానీ, బీచ్ లోకి అడుగుపెట్టిన మరుక్షణం అతనికి అర్థమైంది ఈ నగరం లో ఎప్పటికీ మారనిది ఒకటుందని. పూర్తిగా చదవండి »
‘వ్యాకరణం’ మానవీయ శాస్త్రాలకు అత్యంత ప్రాధమిక అంశమూ కీలక అంశమూ అని విశ్వసించిన కాలం నుంచి వ్యాకరణశాస్త్ర అభ్యాసం, బోధన రెండూ అవసరమా అన్న విచికిత్స కొనసాగుతున్న సందర్భంలో తెలుగు వ్యాకరణాలను పునస్సమీక్షించుకొంటున్నాం.
పూర్తిగా చదవండి »
విచిత్రం ఏమిటంటే భూతలం మీదనున్న అన్ని విషయాల గురించీ ఆందోళన చేస్తున్న సిపిఎం వారు వాకపల్లి ఆందోళననుండి నెమ్మదిగా నిష్క్రమించారు. తెలుగుదేశంవారు కనిపించీ కనిపించకుండా పాల్గొంటున్నారు. దళిత సంఘాలన్నీ మిన్నకున్నాయి. ఆదివాసీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని పేరుబడ్డ స్వచ్ఛంద సంస్థలేవీ ఆ దాపులకు రావడం లేదు.
పూర్తిగా చదవండి »