- డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
ప్రపంచంలో ఎదురయే వింతలూ, విచిత్రమైన విషయాల పట్ల మనిషికి ఆదినుంచీ భయాలూ, అపోహలూ, ఆసక్తీ ఉంటూనే ఉన్నాయి. ఈ మూడు భావాలూ అదే క్రమంలో కలిగాయనేది కూడా నిజం. భయం తీరి, అపోహలు కాస్త కాస్తగా తగ్గాక పెరిగే ఆసక్తి వల్ల మనిషి పరిశోధనలూ, పరిశీలనలూ మొదలుపెట్టాడు. మొదట్లో ప్రకృతిని అర్థం చేసుకోవడం, తరవాత దాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడం ఆరంభించాడు.
పూర్తిగా చదవండి »
మస్కమస్కనే ఉన్నది. ఇంకా పూరా తెల్లారలేదు. ఎదురొచ్చే మనిషి నిద్ద కనిపించడం లేదు. ఆడోల్లు వాకిల్లూడ్చి సానిపి జల్లుతున్నరు. మొగోల్లు ఎడ్ల కొట్టాలల్ల హెర్రె… హెర్రె… అని ఎడ్లను అదిలించుకుంట పెండకసువు తీస్తున్నరు. ఇంకొంతమందేమో అరక గట్టనీకె పగ్గాలు, బారల్లు గుంట్కునొగలను సగసేసుకుంటున్నరు. మంచినీల్ల కడ్వలు పట్టుకొని ఆడోల్లు ఒక్కరొక్కరే మంచినీల్ల బాయికి పోవట్టిండ్రు.
పూర్తిగా చదవండి »
మాల ఓబులేసు నీరసంగా రిక్షా తోసుకుంటూ వచ్చి తన ఇంటి ముందాపాడు. ఇల్లంటే ఇల్లు కాదది బోద వసారా. పేరుకు మాత్రం చుట్టూ నాలుగు మట్టిగోడలుంటాయి. ఆ నాలుగు గోడలు కూడబలుక్కొని కూడా ఆ ఇంకో మంచి కొట్టం రూపైనా ఇవ్వలేక పోతున్నాయి.
ఓబులేసు ఇంటికాడ రిక్షా ఆపుతూనే బిలబిల మంటూ అతని ఆరుగురు సంతానం వచ్చి చుట్టేశారు. ”నాయన! నాయన! “ ”య్యా! యేందే సీదర పొండి” కసిరాడు ఓబులేసు. అతని భార్య లక్ష్మి ముసి ముసిగా నవ్వుకుంటూ కొట్టం లోంచి బయటి కొచ్చింది.
పూర్తిగా చదవండి »

ఆ వస్తున్న సూర్యోదయం మాదే
ఆ ప్రభావగీతం మాదే
ఇక మీద భూమ్మీదవిస్తరించే
నాగరికత ఖచ్చితంగా మాదే
- మహె జబీన్, ఆకురాలు కాలం, పేజీ 21.
పూర్తిగా చదవండి »
- ప్రశాంత్
‘అభివృద్ధి - విధ్వంసం - సాహిత్య ప్రతిఫలనం’ అంశంపై విరసం 15వ రాష్ట్రసాహిత్య పాఠశాల
అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం, దాని వెనక ఉన్న రాజకీయ ఆర్థిక పునాదిని విశ్లేషిస్తూ కర్నూలులో జనవరి 13, 14 తేదీల్లో విరసం రాష్ట్ర సాహిత్య పాఠశాల నిర్వహించింది. 13వ తేదీ ఉదయం పతాకావిష్కరణ అనంతరం ప్రారంభ సమావేశంలో ఆహ్వాన సంఘం తరఫున వెంకటకృష్ణగారు ఉపన్యసించారు.
పూర్తిగా చదవండి »
‘అభివృద్ధి మాయాజాలం - రాజకీయార్థిక పరిచయం’ అంశంపై రెండవ సెషన్, చంద్రశేఖర్ అధ్యక్షోపన్యాసం:
రాష్ట్ర ప్రభుత్వం జలయజ్ఞం పేరుతో చేసే అభివృద్ధిలో 20 లక్షల మంది నిర్వాసితులవుతున్నారు. గిరిజనులే కాదు రైతులు కూడా అధిక సంఖ్యలో నిర్వాసితులవుతున్నారు. మరోప్రక్క ప్రత్యేక ఆర్థిక మండళ్ళు నెలకొల్పి పారిశ్రామికవేత్తలకు ఏది కావాలంటే అది ఇస్తామంటున్నారు. బెంగాల్లో టాటా కంపెనీ పరిశ్రమ కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అంటోంది.
పూర్తిగా చదవండి »
‘రాయలసీమ రాజకీయార్థిక విశ్లేషణ’ అంశంపై 3వ సెషన్లో జి.యస్. రామ్మోహన్ అధ్యక్షోపన్యాసం:
పుట్టపర్తి నారాయణాచార్యులు ‘కపటపు నాయకుల గుంపు, సత్కవీంద్రుల కన్నీటి ముంపు చూడమ్మా,’ అంటాడు మేఘదూతంలో. రాయలసీమకు ఇది సరిగ్గా వర్తిస్తుంది. 1907లో రాయలసీమ యువక సాంఘిక సభ జరిగింది. 1937లో శ్రీ భాగ్ ఒడంబడిక చేసుకొన్నారు. అప్పటి నుండి రాయలసీమ వెనుకబాటుతనం గురించి మాట్లాడుతున్నారు.
పూర్తిగా చదవండి »
14.1.2006 - అసమ అభివృద్ధి, రాయలసీమ సాహిత్యం అంశంపై మొదటి సెషన్
దీనికి రవి అధ్యక్షత వహించారు. భార్గవ రాయలసీమ సాహిత్యాన్ని విశ్లేషిస్తూ మాట్లాడారు. అసమానమైన అభివృద్ధి ఈరోజుది కాకపోయినా, సాహిత్యంలో ఇప్పుడు ప్రతిఫలిస్తోందన్నారు. పీడితులు ఈరోజు సాహిత్య వస్తువును శాసిస్తున్నారు అని చెప్పారు. స్వామి, సింగమనేని నారాయణ వంటి వివిధ రచయితల కథలు, కథా వస్తువులను విశ్లేషించారు.
పూర్తిగా చదవండి »
‘అభివృద్ధి విధ్వంసం - సంస్కృతి రూపాలు’ అంశంపై చివరి సెషన్
రాఘవాచారి అధ్యక్షత వహించగా వేణుగోపాల్ ఉపన్యసించారు.
వేణుగోపాల్ ఉపన్యాసం
‘అభివృద్ధి’ నిర్వచనం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. దీనిని అర్థం చేసుకోవడానికి కైట్ ఫ్లయింగ్ చేయాలి. గాలిపటం ఎగరటంలో నియంత్రణ ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. జాగ్రత్తగా లేకపోతే గాలిపటం ప్రాంతీయవాదంలో కొట్టుకుపోతుంది. అభివృద్ధిని కొన్ని ఉదాహరణలు తీసుకొని నిర్వచించడానికి ప్రయత్నిస్తే… 1956లో వ్యవసాయరంగంలో 1600 ట్రాక్టర్లు ఉండేవి. 2000 సంవత్సరం నాటికి రాష్ట్రంలో వినియోగించే ట్రాక్టర్ల సంఖ్య 90,000. సాగు యోగ్యమైన భూమి 1956 నుండి 2000 వరకు ఏమీ పెరగలేదు. మరి ఎంతమంది కూలీలను ఈ ట్రాక్టర్లు రీప్లేస్ చేశాయి. 1985లో కారంచేడు సంఘటన జరిగింది.
పూర్తిగా చదవండి »
- విమల
ఆదివాసుల ఆత్మబంధువు ఏడీకెళ్ళెనే
అడివీ బిడ్డల తోడునీడ ఏమైపోయెనే
తెలంగాణ కలల పంట నేలరాలినా
అది మొలకలెత్తి వేలవేల రాసులవునులే
http://prajakala.org/audio/Adivasula.mp3
రాయలసీమ, ఉత్తరాంధ్ర, తెలంగాణ, ప్రవాస ప్రజల నుండి వచ్చే అన్నిరకాల ప్రజాసాహిత్యాన్ని వెలుగులోకి తీసుకురావలని ప్రజాకళ ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగా రచయితలు, సాహిత్యాభిమానులు ప్రజాకళకు తమ రచనలను పంపించి సహకారం అందించవలసినది విజ్ఞప్తి చేస్తున్నాం.

దేశాలమధ్య శత్రువ్యూహాల్ని
శవాలు లెక్కతేలుస్తాయి
దేశాల మధ్య వ్యాపార సంబంధాలు అంకెల్తోసహా దొరుకుతాయి
అక్కాతమ్ముళ్ళమధ్య
ఇప్పుడు రక్త సంబంధం ఒక వలస రాగ సంబంధం, ఒక వెట్టి