నేను ఎప్పుడు పుట్టానో తెలియదు గానీ
వేల ఏళ్ల క్రితం ఈ గడ్డమీదనే చంపబడ్డాను
‘పునరపి మరణం పునరపి జననం’
నాకు కర్మ సిద్ధాంతం తెలియదు కానీ
మళ్లీ మళ్లీ మరణించిన
చోటనే పుడుతున్నాను
నాదేశం ఈ దేశంలో కరిగిపోయి
గంగా సింధూ మైదానమయ్యింది
నా కనుగుడ్లు కన్నీరై ద్రవిస్తే
ఈ దేశంలో జీవనదులు ప్రవహించాయి పూర్తిగా చదవండి »
‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వు’ కోసం, ‘చుండూరు గుండె గాయం’ సర్వనామం చేసుకున్న ఓ దళితుని కోసం, ఎంత వెతుక్కున్నా, ఎన్ని ఉద్యమాలు చేసినా ఇంకా చేతికి ‘దక్కని పిడికెడు ఆత్మగౌరవం’ కోసం, ‘చోళీకే పీచే’ బరు కన్నీటి కథల కోసం, సామాజిక, రాజకీయార్థిక వికా సం కోసం వేయిన్నొక్క అద్భుత తెలుగు అనువాదాలు చేసి తానే ఒక చర్చ అయి, పరుగెత్తి పరుగెత్తి డస్సిపోయి మృత్యువు ఒడిలో నిండా యాభై ఏండ్లు నిండకముందే వాలిపోయాడు. ఒంగోలు ఆస్పవూతిలో మన మిత్రుడు, సాహితీవేత్త, దళిత ఆత్మగౌరవ పతాక, అలుపెరగని నిత్యనూతన సాహితీ ‘యువక’ కలేకూరి ప్రసాద్. పూర్తిగా చదవండి »
పవిత్రత శీలం అనే పదాలతో
నా చేతులను అలంకరించాడు
ఖైదీల మల్లే
నా కాళ్ళకు సంకెళ్ళు వేశాడు
దాన్ని మర్యాద మన్ననా అని పిలిచాడు
ఎంత తియ్యని పదాలవి! పూర్తిగా చదవండి »
అమెరికాకు వచ్చినా, వస్తున్నా తెలుగు వారు – ఆ మాటకొస్తే భారతీయులు తమతో పాటు తమ అలవాట్లూ, ఆచారాలు, కట్టుబాట్లు వెంట తెస్తున్నారు. అది సహజం దాంతో బాటు కళలు, వృత్తి నైపుణ్యత వస్తున్నవి. అది కూడా మంచిదే. ఉద్యోగరీత్యా వచ్చి స్థిరపడి గ్రీన్ కార్డ్ లను ఆ తరువాత పౌరసత్వం స్వీకరిస్తున్నారు. ఆర్థికంగా సొంత కాళ్ళపై నిలబడి జీవించగలుగుతున్నారు.
సమాజాన్ని మార్చాలనే తపన, సునిశితమైన పరిశీలన, సమాజంలో మార్పు కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడని కరుకుదనం, అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం, అణగారిన వర్గాల పట్ల గుండెల్లో చెమ్మ, సహచరుల పట్ల ఆర్తి కొండపల్లి సీతారామయ్య ప్రత్యేకతలు… విప్లవ స్వప్నం నిజమయ్యే వరకు ఆయన ప్రేరణ, ఆయన జ్ఞాపకాలు, ఆయన వర్గ విశ్లేషణ, ఆయన ఆచరణ, ఆయన సిద్ధాంతం దిశానిర్దేశం చేస్తూనే ఉంటాయి. కె.ఎస్. ఒక వ్యక్తి కాదు, విప్లవ శక్తి. విప్లవోత్తేజానికి ఒక చిరునామా. భారత విప్లవోద్యమంలో ఒక చెరగని ముద్ర.
శివసాగర్ తాను నడిచిన నేలంతా పోరాట బీజాలు చల్లిపోయాడు. వ్యక్తిగత జీవితం లేకుండా ఒక మెరుగైన మానవీయ సమాజాన్ని కల గని ఒక ప్రత్యామ్నాయ ఆలోచనా స్రవంతిని ఈ లోకానికి అందించి మననుంచి వెళ్ళిపోయాడు.
‘గుజరాత్ లో మూడు వేలమంది ముస్లింలు, పసిపిల్లలు, స్త్రీలను మోడీ చంపేశారు .. మీడియా ఎందుకు మోడీ ని ప్రధానమంత్రి అభ్యర్ధిగా ప్రచారం చేస్తోంది? ఎందుకంటే ఇంగ్లీషు మీడియా కార్పరేటు రంగం చేతిలోవున్నది’.
వరంగల్, వాకపల్లి, ఇంఫాల్ లలో మహిళల పైన రాష్ట్ర, కేంద్ర పోలీసు బలగాలు అత్యాచారాలు పాల్పడాయని ఆరోపణలున్నాయి. సెలవులు దొరకని నిరంతర శ్రమ వాళ్ళ శరీరాల్నిమొద్దుబార్చేస్తుంటే .. అయిన వాళ్ళకు ఏళ్ళ తరబడి దూరంగా వుండాల్సిరావడం వాళ్ళ మనసుల్ని మలినం చేస్తుంది… ఖాకీచకుల కబంధ హస్తాలనుంచి.. అందర్నీ కాకపోయినా… కనీసం అబలల్నయినా ఆదుకోలేకపోతే …. మనమూ మన వ్యవస్థ వుండీ లేనట్టే మన కళ్ళను మనం కుళ్ళబొడుచు కున్నట్టే ..
ఎలుకలు కొట్టిన రత్నకంబళం
ఇప్పుడు నా భరత దేశం
చెప్పుకోవడానికే తప్ప
కప్పుకోవడానికి లేదు
దండెత్తి వచ్చిన చుండెలుకల కన్నా దారుణం
ముంగిలి మూషికాల ముచ్చిలితనం పూర్తిగా చదవండి »